28న విశాఖ రానున్న సీఎం జగన్‌

28న విశాఖ రానున్న సీఎం జగన్‌
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 28న విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ విశాఖ ఉత్సవ్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారని ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 28న విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ విశాఖ ఉత్సవ్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన గురించి జిల్లా అధికారులకు సమాచారం అందింది. కాగా ఆ రోజు సీఎం విశాఖ ఉత్సవ్‌లో పాల్గొనడంతో పాటు జీవీఎంసీ, వీఎంఆర్డీఏ చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది.

విజయవాడలో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన విందులో ఆయన పర్యటనకు సంబంధించిన ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. అసెంబ్లీలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండవచ్చని ముఖ్యమంత్రి ఫీలర్ వదిలారు. దాంతో ఉత్తరాంధ్ర వాసుల్లో ఆనందం నెలకొంది. సీఎం వ్యాఖ్యలను ఆ ప్రాంత వాసులు స్వాగతించారు. దీంతో ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై జిల్లా వైసీపీ నేతలు ఆనందంగా స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కు ఘనస్వాగతం పలకనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories