నేడు కడప జిల్లాకు సీఎం జగన్‌

నేడు కడప జిల్లాకు సీఎం జగన్‌
x
Highlights

నేడు వైఎస్సార్‌ కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 8.10 గంటలకు తాడేపల్లిలో తన నివాసం నుంచి బయలుదేరి 8.45...

నేడు వైఎస్సార్‌ కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 8.10 గంటలకు తాడేపల్లిలో తన నివాసం నుంచి బయలుదేరి 8.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 8.55 గంటలకు గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి 09.05 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. రేణిగుంటలో ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, బల్లి దుర్గాప్రసాద్, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు,

ఇతర కీలక నేతలు రేణిగుంట విమానాశ్రయం లో సీఎంకు స్వాగతం పలకనున్నారు. రేణిగుంట నుంచి ఉదయం 10.15 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లికి చేరుకుంటారు. ఈ సందర్బంగా అక్కడ కడప స్టీల్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయినట్లు కడప జిల్లా కలెక్టర్‌ నారాయణభరత్‌గుప్త తెలిపారు. జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories