5న 'కియా' వద్దకు సీఎం వైఎస్‌ జగన్‌

5న కియా వద్దకు సీఎం వైఎస్‌ జగన్‌
x
ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్‌మోహన్‌ రెడ్డి
Highlights

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 5న అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 5న అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. 'కియా' మోటర్స్‌ కంపెనీ గ్రాండ్‌ ఓపెనింగ్‌ సెర్మనీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం ప్రోగ్రాం షెడ్యూల్‌ను అధికారులు మంగళవారం విడుదల చేశారు.

ముఖ్యమంత్రి పర్యటనపై మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మాట్లాడారు. ఈ నెల 5న కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీ వేడుకలకు ముఖ్యమంత్రి హాజరవుతారని ఆయన తెలిపారు. పరిశ్రమ పురోగతి, కార్ల ఉత్పత్తి, సౌకర్యాలు, ఉద్యోగాల కల్పన తదితర విషయాలపై 'కియా' ప్రతినిధులతో సీఎం సమీక్షించనున్నట్లు మంత్రి చెప్పారు.

కాగా ఈ నెల 5వ తేదీ ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 10.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారని.. 10.40 గంలలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.05 గంటలకు పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద ఉన్న కియా మోటర్స్‌ వద్దకు వెళతారు.

మధ్యాహ్నం 12.35 గంటల వరకు ప్లాంట్‌ టూర్‌లో భాగంగా పరిపాలన విభాగం, ప్రెస్, బాడీ, పైయింట్, అసెంబ్లీంగ్, ఇంజన్‌ షాప్‌లను, టెస్ట్‌ డ్రైవర్‌ను పరిశీలిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 12.35 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు ఓపెనింగ్‌ సెర్మనీలో పాల్గొని ప్రసంగిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories