బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ యాక్సిడెంట్ బాధితురాలికి సీఎం జగన్ సహాయం

బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ యాక్సిడెంట్ బాధితురాలికి సీఎం జగన్ సహాయం
x
Highlights

హైదరాబాద్ బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుండి దూకి వచ్చిన కారు ప్రమాద ఘటనలో ఒక యువతి అక్కడికక్కడే మరణించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురానికి చెందిన...

హైదరాబాద్ బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుండి దూకి వచ్చిన కారు ప్రమాద ఘటనలో ఒక యువతి అక్కడికక్కడే మరణించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురానికి చెందిన కుబ్రా బేగం అనే మరో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. దీంతో కుబ్రా బేగంను ఆసుపత్రిలో చేర్చగా ఆపరేషన్ చేయాలనీ.. అందుకు రూ. 5లక్షలు ఖర్చ అవుతాయని ఆసుపత్రి సిబ్బంది తెలియజేయడంతో.. సాధారణ పెయింటర్ గా జీవనం సాగించే ఆ యువతి తండ్రి అబ్దుల్ అజీమ్ అంత డబ్బు చెల్లించే స్తోమత లేకపోవడంతో డబ్బులకోసం బంధువులు, తెలిసిన వాళ్ళ వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్నీ తెలుసుకున్నారు. వెంటనే స్పందించి ఆమె ఆపరేషన్ కు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజెయ్యాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆపరేషన్ తర్వాత కూడా యువతి తిరిగి సాధారణ స్థితికి చేరుకు నేవరకు కొంత డబ్బు ఆ యువతి తండ్రికి ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఆపరేషన్ అనంతరం ఆ యువతి కోలుకుంది. తమ కూతురు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోవడంతో ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేవు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories