ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనున్న జగన్ ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనున్న జగన్
నవంబర్ 14న ఏపీలో మరో బృహత్తర కార్యక్రమం ప్రారంభం అవుతోంది. 'నాడు-నేడు' కార్యక్రమం పేరుతో పాఠశాలలు, ఆసుపత్రులు, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాలలు, ఐటిఐలు, గురుకుల్ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు.ఈ పథకాన్ని ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. నాడు-నేడు కార్యక్రమంపై మంగళవారం ఇక్కడ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి. నాడు-నేడు కార్యక్రమం కింద సుమారు 45,000 పాఠశాలలను పునరుద్ధరిస్తామని చెప్పారు. రెండో దశలో, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటిఐలు, గురుకుల్ పాఠశాలలు, హాస్టళ్ళ పునరుద్ధరణ పనులు చేపడతామన్నారు. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు మరుగుదొడ్లు, కాంపౌండ్ గోడలు, ఫర్నిచర్, ఫ్యాన్లు, బ్లాక్ బోర్డ్ మరియు పెయింటింగ్ సహా అవసరమైన మౌలిక సదుపాయాలను ఈ పథకం ద్వారా ఏర్పాటు చేస్తారు. ప్రతి పాఠశాలలో జరగాల్సిన పనులకు చెక్లిస్ట్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సుమారు తొమ్మిది రకాల పనులు ఈ పథకం ద్వారా చేపట్టనున్నారు.. నాడు-నేడు కార్యక్రమంలో విద్యా కమిటీలు కూడా పాల్గొంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. అందువల్ల
విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా ఉంటుందని అన్నారు. దీంతో పాఠశాల నిర్వహణ సమస్యలు వారికి తెలుస్తాయన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో ప్రతి విడతలో గ్రామీణ, గిరిజన మరియు మునిసిపల్ ప్రాంతాల్లోని పాఠశాలలు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. దీనికోసం తాము ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు అధికారులు ఆయనకు తెలియజేశారు. పాఠశాల యూనిఫాం, ఫర్నిచర్ విషయంలో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ముఖ్యమంత్రి అన్నారు. మండలాల్లోని ఉన్నత పాఠశాలలను జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలని, ఉపాధ్యాయుల నిష్పత్తి విద్యార్థుల జనాభాకు అనుగుణంగా ఉండేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. సంక్రాంతి కల్లా ఈ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని క్లాస్ -1 నుంచి 8 వరకు అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించి పాఠ్యాంశాలను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో పిల్లలకు యూనిఫాం, బూట్లు, పుస్తకాలు పంపిణీ చేయాలని ఆయన అధికారులను కోరారు.
సెప్టెంబరు లేదా అక్టోబర్ వరకు పిల్లలు పుస్తకాలు స్వీకరించని సందర్భం ఉండకూడదని ఆయన అధికారులకు చెప్పారు. అంతేకాదు నాడు-నేడు కింద ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కూడా పునరుద్ధరిస్తోంది. ఇందులో ఉప కేంద్రాలు, పిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా ఆసుపత్రులు మరియు బోధనా ఆసుపత్రులను కూడా పునరుద్ధరిస్తున్నారు. ఆసుపత్రులలో మందుల కొరత ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. డిసెంబర్ 15 నుండి 510 కి పైగా మందులు ఆసుపత్రులలో లభిస్తాయని ఆయన చెప్పారు. నెట్వర్క్ ఆస్పత్రులు మరియు ప్రభుత్వ ఆసుపత్రులు నాణ్యతా ప్రమాణాలతో సమానంగా ఉండాలి. వచ్చే ఏడాది మే నాటికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, నర్సుల పోస్టులను భర్తీ చేయాలని ఆయన అధికారులను కోరారు. ఇందుకు సంబంధించిన క్యాలెండర్ జనవరి నాటికి తయారు చేయాలని కోరారు. ఆర్థిక వనరులకు కొరత ఉండదని ఆయన అధికారులను హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు ఆదిములాపు సురేష్, అల్లా నాని, అధికారులు పాల్గొన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire