శ్రీకాకుళం జిల్లాలో నేడు సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్‌

Jyothi
Published on: 27 Jun 2022 8:37 AM IST
CM Jagan Visits Srikakulam District Today
X

శ్రీకాకుళం జిల్లాలో నేడు సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: జగనన్న అమ్మ ఒడి పథకం కింద మూడో ఏడాది ఆర్ధిక సాయాన్ని ఏపీ సీఎం జగన్ ఇవాళ శ్రీకాకుళంలో జరిగే కార్యక్రమం ద్వారా అందించనున్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి ఈ పథకం కింద.. ఒకటి నుండి ఇంటర్‌ వరకు చదువుతున్న 82లక్షల 31వేల 502 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ…43లక్షల 96వేల 402 మంది తల్లుల ఖాతాల్లో 6వేల 595 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేయనున్నారు.

ఇవాళ అందిస్తున్న 6వేల 595 కోట్లతో కలిపి ఇప్పటివరకు అమ్మ ఒడి పథకం క్రింద ప్రభుత్వం అందించిన మొత్తం సొమ్ము 19వేల 618 కోట్ల రూపాయలు.

Jyothi

Jyothi

Next Story