రాజధానిపై నేడు కీలక నిర్ణయం ఉంటుందా?

రాజధానిపై నేడు కీలక నిర్ణయం ఉంటుందా?
x
Highlights

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(CRDA)పై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు సీఎస్,...

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(CRDA)పై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు సీఎస్, ఉన్నతాధికారులు, సీఆర్డీఏ చైర్మన్, కమీషనర్ తదితరులు హాజరవుతారు. ముఖ్యంగా రైతులకు చెల్లించాల్సిన కౌలు, రాజధాని భవనాల నిర్మాణంపై సమీక్ష జరగనుంది. కాగా అమరావతి ప్రాంత రైతులు రాజధానిపై స్పష్టత ఇవ్వాలని ధర్నాలు చేస్తున్నారు. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అమరావతి రాజధానిలో గత టీడీపీ ప్రభుత్వం భారీగా ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా బయటపెడుతోంది. ఈ క్రమంలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై కీలక సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని భావిస్తున్న తరుణంలో నేడు ఆ వివరాలు బయటపెడతారా అన్న చర్చ జరుగుతోంది. ఇక ఇప్పటికే రాజధాని విషయంలో కొంత సందిగ్థత నెలకొన్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories