Central Tribal University: సాలూరులో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్
Central Tribal University: గిరి జనులు ప్రపంచంతో పోటీపడతారన్న జగన్
Central Tribal University: సాలూరులో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్
Central Tribal University: సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561 ఎకరాల్లో, 834 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మరడాం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. తనను నిరంతరం గుండెల్లో పెట్టుకుంటున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారని జగన్ అన్నారు.
Next Story




