దుబాయ్ ఎయిర్పోర్టులో దిగిన సీఎం జగన్

దుబాయ్ ఎయిర్పోర్టులో దిగిన సీఎం జగన్
x
Highlights

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాత్రి విమానం ఎక్కిన ఆయన ఉదయం 8 గంటలకు దుబాయ్ ఎయిర్పోర్టులో దిగారు....

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాత్రి విమానం ఎక్కిన ఆయన ఉదయం 8 గంటలకు దుబాయ్ ఎయిర్పోర్టులో దిగారు. ఆయనకు దుబాయ్ ఎంబసీ అధికారులు స్వాగతం పలికారు. సీఎం వెంట ఎంపీలు పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి, మార్గని భరత్ , ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ఉన్నారు. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్ట్‌ 17న ప్రసిద్ధ డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్)లో ప్రవాసాంధ్రులును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వారం రోజుల పాటు సీఎం జగన్‌ అమెరికా పర్యటన ఉండనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories