
CM Jagan: గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలని చూస్తున్న సీఎం జగన్
CM Jagan: ఎన్నికల సమీపిస్తున్న వేళ వైసీపీలో గ్రూపు రాజకీయాలు
CM Jagan: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. వైనాట్ 175 అంటూ సీఎం జగన్ పదేపదే చెబుతున్నా... ఉన్న సీట్లకే ఎసరుతెచ్చేలా కొందరు నాయకులు వ్యవహరిస్తున్నారని.. సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అంతర్గతంగా ఉన్న సమస్యలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. పార్టీలో నేతల మధ్య ఉన్న అగాదానికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీలోని నేతలంతా కలిసి కట్టుగా వెళితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని సీఎం జగన్ భావిస్తున్నా... నాయకుల మధ్య గ్రూప్ రాజకీయాలు అధిష్టానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. దీంతో వీలైనంత తొందరగా కుమ్ములాటలకు చెక్ పెట్టి ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ వ్యూహలు రచిస్తున్నారు.
గ్రూపుల గోలకు చెక్ పెట్టేందుకు వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లోని కొంతమంది నాయకుల మధ్య గ్రూపిజం నడుస్తుందన్న దానిపై పక్కా సమాచారాన్ని చేతిలో పట్టుకున్న పార్టీ ఆధినేత, సీఎం జగన్ ఆచితూచి అడుగులేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డితో పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. ఎంపీ విజయసాయి స్వయంగా బాలినేని ఇంటికి వెళ్లి గంటకుపైగా చర్చలు జరిపారు. అధిష్టానం చెప్పిన పలు అంశాలను ఆయనకు వివరించారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా గతంలో చేసిన రాజీనామాను ఉపసంహరించుకుని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కావాలని సూచించినట్లు తెలిసింది.
అంతేకాకుండా అక్కడ రాజకీయంగా విబేధాలున్న వైవీ సుబ్బారెడ్డి పూర్తిగా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి హోదాలో పనిచేసుకుంటూ పోతారని సముదాయించినట్లు చెబుతున్నారు. సుబ్బారెడ్డి జోక్యం అంతగా ఉండబోదని కూడా అధిష్టానం చెప్పిందని ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై అటు బాలినేనిగానీ, ఇటు విజయసాయిగానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా ఒకవైపు బాలినేనిని సముదాయిస్తూనే ఆయన అధిష్టానం మట వినకుంటే ఆయన స్థానంలో విజయసాయికి ప్రాంతీయ సమన్వయకర్తగా అవకాశం కల్పించేందుకు కూడా వెనుకాడబోదన్న సంకేతాలను పంపినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగుతోంది. బాలినేని మాత్రం విజయసాయి దౌత్యా నికి కొంత మెత్తబడినట్లు తెలిసినా ఇంకా పూర్తిగా అంగీకారం తెలిపలేదని అంటున్నారు. బాలినేని కూడా వేరే పార్టీలోకి వెళ్లలేక, ఈ పార్టీలో ఉంటూ కార్యకర్తలకు అండగా నిలవలేక మానసికంగా సంఘర్షణకు గురవుతున్నారని, ఈ విషయాన్ని అధిష్టానం కూడా గుర్తించబట్టే నాచివేత ధోరణి అవలంభిస్తూ వస్తోందని అంటున్నారు. అంతేకాకుండా సుబ్బారెడ్డి దూకుడుకు కూడా బ్రేకులు వేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో విజయసాయి ఏం చెప్పారు.. బాలినేని నిర్ణయం ఎలా ఉండబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లోకెక్కడంపై అధినేత అగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణల మధ్య అగాధం అంతకంతకూ పెరుగుతూ తీవ్రస్థాయికి చేరుకుంది. ఇద్దరూ బహిరంగంగా మీడియాకెక్కి మాట్లాడటం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈమేరకు అక్కడ జరుగున్న సున్నితమైన అంశాలన్నింటినీ అధినేత నిశితంగా
గమనిస్తున్నట్లు చెబుతున్నారు. స్వయంగా తానే పిలిచి మాట్లాడి పంపిన తరువాత అక్కడ బజారుకెక్కడంపట్ల అధినేత తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తంచేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడానికి అక్కడ ఒకవైపు అధినేత కుటుంబానికి విధేయుడిగా ఉంటూ పార్టీ ఆవిర్భావం నుండి ఆయనతో నడిచిన వ్యక్తి ఒకరైతే, తానే టిక్కెట్టు ఇచ్చి, ఎమ్మెల్యేను చేసి మంత్రిని చేసిన వ్యక్తి మరొకరు. ఈనేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల పార్టీ బాధ్యుడు, లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి అధినేత పలు సూచనలు చేశారని చెబుతున్నారు. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న వారు సీరియస్గా తీసుకుని త్వరలోనే ఫుల్స్టాప్ పెట్టాని స్పష్టంగా చెప్పారని అంటున్నారు. ఇద్దరితోనూ మాట్లాడి పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, ఈలోగా మీడియాకెక్కి మాట్లాడొద్దని ఆయన స్పష్టంగా సూచించాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అయితే, వారితో సీఎం జగన్ మరోమారు మాట్లాడి ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చిన మీదట వారికి చెప్పాల్సిన రీతిలో చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం.
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ ఛైర్మన్ బైరెడ్డి వర్గాలు రోడ్డెక్కి ఆందోళ నలకు దిగడంపై కూడా పార్టీ సీరియస్గా దృష్టిపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ నియోజకవర్గం ఒకవైపు, అక్కడ అభ్యర్ధిని గెలిపించడంలో కీలక భూమిక పోషించిన నేత మరో వైపు ఉండటంతో అక్కడ కూడా సమస్య సున్నితంగా మారింది. ఈ క్రమంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నదానిపై ఆచితూచి అడుగులేస్తోంది అధిష్టానం. ఇద్దరికీ ఎవరికి చెప్పే రీతిలో వారికి చెప్పి రోడ్డెక్కకుండా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇదే తరహాలో రాష్ట్రంలో గ్రూపిజం నడుస్తున్న పలు నియోజక వర్గాలపై కూడా అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎక్కడెక్కడ సమస్య సున్నితంగా ఉందో అక్కడ ఇప్పటి నుంచి దృష్టిపెట్టి సమస్యకు చెక్ పెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




