సీఎం జగన్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ !

సీఎం జగన్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ !
x
Highlights

తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైనందున కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైనందున కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరుగనుంది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఇప్పటికే సీబీఐకి స్పెషల్ కోర్టు నోటీసులు జారీ చేసింది.

సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ లో.. ఈ కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్ అని, ఆయన ప్రస్తుతం సీఎంగా ఉన్నందున, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇస్తే, సాక్షులను ప్రభావితం చేస్తారనే అనుమానాన్ని కోర్టుకు తెలిపింది. అంతేకాదు వారానికోసారి కోర్టుకు హాజరయ్యేందుకు సీఎం అయినా ఇబ్బందులు ఏంటని పేర్కొంది.

కాగా, సీబీఐ కౌంటర్ పిటిషన్ పై నేడు కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇవాళే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే, గతంలో కూడా ముఖ్యమంత్రులపై నమోదైన కేసుల్లో చాలా మందికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. ఈ క్రమంలో జగన్ కు కూడా ఈ తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories