మార్కాపురంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

మార్కాపురంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
x
Highlights

మార్కాపురంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ మార్కాపురంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

ప్రకాశం జిల్లా మార్కాపురంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మార్కాపురం తోపాటు పులివెందుల, మచిలీపట్నంలలో కూడా వైద్య కళాశాలలు ఏర్పాటు చెయ్యాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. వీలైనంత త్వరగా ఆ ప్రాంతాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్) తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం ఈ డీపీఆర్ లను ఆమోదించిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. బుధవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన వైద్యఆరోగ్య శాఖ సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక మార్కాపురంలో వైద్య కళాశాలను ఏర్పాటు చెయ్యాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే ప్రజాప్రతినిధులు పెద్దగా దృష్టిసారించలేదు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం ఏర్పడ్డ మూడు నెలల కాలంలోనే దీనిపై నిర్ణయం తీసుకుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ఇందులో ముఖ్య భూమిక పోషించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories