
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఓ షాపు యజమాని లబోదిబోమంటున్నాడు. శుభమస్తు బట్టల షాపు ప్రారంభించి ఆరు సంవత్సరాల అవుతుండడంతో షాపు యజమాని మహిళలకు...
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఓ షాపు యజమాని లబోదిబోమంటున్నాడు. శుభమస్తు బట్టల షాపు ప్రారంభించి ఆరు సంవత్సరాల అవుతుండడంతో షాపు యజమాని మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. పట్టణ మహిళలకు తక్కువ ధరకే చీరలు అందించాలనే ఉద్దేశంతో ఒక్క రూపాయికే చీరని బోర్డు పెట్టాడు. అది చూసిన మహిళలు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో బారులు తీరారు.
అయితే ఒక్కసారిగా జనం పెరిగి పోవడంతో షాప్ సిబ్బంది కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరోపక్క రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనం అధికంగా రావడంతో షాపు యజమానులు ఆఫర్ను క్లోజ్ చేసి నో స్టాక్ బోర్డులు పెట్టి షాప్ మూసి వేశారు. అయితే కొందరు మహిళలు ఇదే అదునుగా షాపులోకి దూసుకుపోయి చీరలను తీసుకుని వెళ్ళిపోయారు. దీంతో ఆ షాపు యజమాని లబోదిబో మంటున్నాడు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire