చంద్రగిరిలో మరోసారి ఉద్రిక్తతలు

చంద్రగిరిలో మరోసారి ఉద్రిక్తతలు
x
Highlights

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మంగిలపట్టులో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు....

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మంగిలపట్టులో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు అక్కడే బైఠాయించారు. ఈ క్రమంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. వారం రోజుల్లో ఇలా జరగడం ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా ఎస్పీ సపరేట్ టీం లను ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తున్నారు. మరోవైపు తాజా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. కొందరు అధికారులు టీడీపీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మనుషులు అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ అభ్యర్థి నాని మాత్రం చెవిరెడ్డి రౌడీయిజం ఇక్కడ సాగదని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories