పల్నాడులో మళ్ళీ రచ్చ..వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

పల్నాడులో మళ్ళీ రచ్చ..వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ
x
Highlights

పల్నాడులో మళ్ళీ రచ్చ..వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ పల్నాడులో మళ్ళీ రచ్చ..వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

గుంటూరు జిల్లా పల్నాడులో మళ్ళీ టెన్షన్ వాతావరణం తలెత్తింది. గురజాల మండలం మాడుగులలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చిన్నపాటి వివాదం కాస్త పెద్ద గొడవకు దారితీసింది. దీంతో ఇరు పార్టీలు తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు నేతలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. టీడీపీ వారు దాడి చేశారని వైసీపీ నేతలు..

వైసీపీ వారు దాడి చేశారని టీడీపీ నేతలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఘర్షణలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. గురజాలలో ప్రత్యేక పొలిసు బలగాలు రంగంలోకి దిగాయి. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories