అమరావతి భూముల కుంభకోణంపై ఈడీ కేసు నమోదు

అమరావతి భూముల కుంభకోణంపై ఈడీ కేసు నమోదు
x
అమరావతి భూముల కుంభకోణంపై ఈడీ కేసు నమోదు
Highlights

రాజధాని అమరావతి భూముల కుంభకోణంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. అమరావతి భూముల కొనుగోలు అక్రమాలపై కేసు నమోదు చేయాలంటూ గతంలో ఈడీకి...

రాజధాని అమరావతి భూముల కుంభకోణంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. అమరావతి భూముల కొనుగోలు అక్రమాలపై కేసు నమోదు చేయాలంటూ గతంలో ఈడీకి సీఐడీ లేఖ రాసింది. దీంతో ఈడీ కేసు నమోదు చేసింది.

అమరావతి కోర్ ఏరియాలో 720 ఎకరాలను 790 మంది తెల్లరేషన్ కార్డుదారులు భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ గుర్తించింది. ఈ భూములను పేదల పేరిట రాజకీయ నాయకులు భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో విచారణ జరిపించాలని సీఐడీ, ఈడీకి లేఖ రాసింది. సీఐడీ లేఖపై ఈడీ స్పందించి అమరావతి భూముల కుంభకోణం కేసు నమోదు చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories