ఆ ప్రచారం అవాస్తవం: అయ్యన్నపాత్రుడు

ఆ ప్రచారం అవాస్తవం: అయ్యన్నపాత్రుడు
x
Highlights

టీడీపీకి బలం కార్యకర్తలని, ఎన్నోసార్లు పార్టీని కాపాడారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. 35 ఏళ్లలో గెలుపు, ఓటములు రెండూ చూశామని, పంచాయతీ,...

టీడీపీకి బలం కార్యకర్తలని, ఎన్నోసార్లు పార్టీని కాపాడారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. 35 ఏళ్లలో గెలుపు, ఓటములు రెండూ చూశామని, పంచాయతీ, మున్సిపల్‌, కార్పోరేషన్‌ ఎన్నికల్లో గెలుపునకు ప్రణాళికా బద్ధంగా పని చేస్తామని వెల్లడించారు. కార్యకర్తలను కక్షకట్టి దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోమని, తగినవిధంగా పని చేస్తామని తెలిపారు. టీడీపీ పునాదులు కదులుతున్నాయని సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారం సరికాదని, ఇది ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీని, తమ భవిష్యత్‌ బాగుంటుందని అయ్యన్నపాత్రుడు ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ సర్కారు పనితీరుని ఆరు, ఏడు నెలలు గమనిస్తామని, మంచి పనులు చేస్తే సహకరిస్తామని అయ్యన్న పాత్రుడు అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories