ఇంత నీచంగా ప్రవర్తిస్తారా : చంద్రబాబు

ఇంత నీచంగా ప్రవర్తిస్తారా : చంద్రబాబు
x
Highlights

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ను ప్రభుత్వం మానసికంగా వేధించిందని టీడీపీ ఆధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కోడెలను...

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ను ప్రభుత్వం మానసికంగా వేధించిందని టీడీపీ ఆధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కోడెలను వేధించారని, ఇంత నీచంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం తీరు టెర్రరిస్ట్‌లను మించిన దానికంటే దారుణంగా ఉందన్నారు.

అసెంబ్లీ ఫర్నిచర్ విషయంపై కోడెల నాలుగు లేఖలు రాశారని.. వాటికి ఆధారాల్ని చూపించారు చంద్రబాబు. కావాలనే కుట్రతో కేసులు పెట్టి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారని ఆరోపించారు. కోడెల దగ్గరున్న ఫర్నిచర్ విలువ ఒకటి రెండు లక్షల రూపాయలు విలువ ఉంటే.. 43 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన నిందితుడు ఈ కేసు పెట్టారని సీఎం జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ నేతను వదలకుండా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డి పైన, అచ్చెన్నాయుడిపైనా, నన్నపనేనిపైనా అక్రమ కేసులు పెట్టారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి.. రాజకీయ కక్ష సాధింపులకే జగన్‌ ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories