
ప్రజావేదిక కూల్చివేతతోనే వైసీపీ సర్కార్ విధ్వంసం ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు.
ప్రజావేదిక కూల్చివేతతోనే వైసీపీ సర్కార్ విధ్వంసం ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు. అమరావతిలో పరిపాలనకు కావాల్సిన భవనాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు జై అమరావతి.. జైజై అమరావతి అంటూ ప్రసంగం మొదలు పెట్టారు. ఈ సీఎం జగన్ కు అభివృద్ధి చేతకాదు.. విధ్వంసం మాత్రమే తెలుసు అని విమర్శలు గుప్పించారు. అమరావతి పరిరక్షణ ర్యాలీ చేపట్టిన జేఏసీకి సంఘీభావం తెలపకుండా చిత్తూరు జిల్లా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. దీని ద్వారా తననూ అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
అమరావతిలో పరిపాలనకు కావాల్సిన అన్ని భవనాలు ఉన్నాయని, అమరావతి రాజధాని ఎందుకు మారుస్తు్న్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీసీ నేతులు రాజధాని మునిగిపోతుందని అసత్యలు చెబుతున్నారని, నాగరికత నీళ్లు ఉన్నచోటే పుట్టిందని తెలిపారు. చరిత్ర తెలిసి మాట్లాడాలని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి ఉండాలని ఆశీర్వదించాలని భగవంతుడిని కోరా.. శాతవాహనుల కాలం నుంచి రాజధాని అమరావతి నుంచే పాలన సాగిందని గుర్తు చేశారు. చరిత్ర కూడా తెలియాదా? అని ప్రశ్నించారు. తిరుపతి వీధుల్లోనే తిరిగానని, నాగరికత వెలిసింది నదీ తీరాల్లోనేనని తెలిపారు. రాజధాని అంటే ప్రభుత్వం అపహాస్యంగా ఉందని. రాజధాని ఎందుకు మారుస్తున్నారో సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం మారితే రాజధానులు మారుతాయా? అని ప్రశ్నించారు. అమరావతి రైతులకు పొలాలు తిరిగి ఇస్తామని అంటున్నారు. ఎక్కడ నుంచి ఇస్తారు వారి అసెంబ్లీ, సచివాలయం. హైకోర్టు, పడగొట్టి ఇస్తారా అని చంద్రబాబు నిలదీశారు.
విశాఖలో భూములు కొట్టేయాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు అంటూ చంద్రబాబు ఆరోపించారు. విశాఖలో 7 నెలలుగా దొంగ లెక్కలు రాస్తున్నారని. విశాఖపట్నం రాజధాని అయితే రాయలసీమ జిల్లాలకు చాలా దూరం అని చెప్పారు. కుప్పం నుంచి విశాఖ వెళ్లాలంటే 950 కి.మీల దూరం ఉంటుంది. రాష్ట్రానికి రాజధాని ఒక్కటే ఉంటుంది. రాజధాని కావాలని విశాఖ ప్రజలు అడిగారా? అని ప్రశ్నించారు. అభివృద్ధికి రాజధానికి సంబంధం లేదని తెలిపారు. తాను ఒక్క పిలుపుకు రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారు. ఒక్క పైసా కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. రాజధాని కాకపోయినా అభివృద్ది చెందింది. డేటా సెంటర్లు, లులూ సెంటర్ ఎందుకు రద్దు చేశారో చెప్పాలని, మెట్రో రైలు, విమానాశ్రయం విశాఖలో ఎందుకు ప్రారంభించలేదు. అక్కడ కూడా నూతన భవనాలు నిర్మిస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire