భారత ప్రధాని మోడీ ఈరోజు (ఆదివారం) జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
భారత ప్రధాని మోడీ ఈరోజు (ఆదివారం) జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. ప్రజలకు బయటకు రాకుండా ఇళ్ళకు మాత్రమే పరిమితం అవ్వాలని కోరారు.. దీనికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు.. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా రోడ్లు అన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జనతా కర్ఫ్యూ కి ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమవుతున్నారు.
ఇక నిత్యం రాజకీయాలతో బిజీ బిజీగా ఉండేవారు కాస్త సమయం దొరికేసరికి సరదాగా తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఈ క్రమంలో టిడిపి అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ తో సరదాగా గడిపారు. దేవాన్ష్ కోసం బుక్ చదువుతూ దేవాన్ష్ కి పాఠాలు చెబుతూ ఇస్తున్నారు.. దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు ట్వీట్ చేస్తూ.. జనతా కర్ఫ్యూ మన కోసం.. ఇవాళ అందరం మన కుటుంబాల కోసం సమయం కేటాయిద్దాం అని పిలుపునిచ్చారు. ఇక జనతా కర్ఫ్యూ ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది.
Observing #JantaCurfew by reading out a book to Devaansh. It is for our safety that we stay at home today and spend time with our families.#Covid_19india#COVID19outbreak pic.twitter.com/o1qpKujSwa
— N Chandrababu Naidu (@ncbn) March 22, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire