ఏపీని విచ్ఛిన్నం చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది : చంద్రబాబు

ఏపీని విచ్ఛిన్నం చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది : చంద్రబాబు
x
చంద్రబాబు
Highlights

రాష్ట్ర విభజన జరిగిన ఆరేళ్ల తర్వాత కూడా రాజధాని కోసం పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రపంచస్థాయి రాజధానిని...

రాష్ట్ర విభజన జరిగిన ఆరేళ్ల తర్వాత కూడా రాజధాని కోసం పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలన్న విజన్‌తోనే తాము అమరావతికి ప్లాన్ చేశామని, కానీ ఇప్పుడు వైసీపీ పాలకులు స్మశానంతో పోల్చడం దారుణమన్నారు. ఎక్కడైనా ఏ రాజధాని అయినా ఒక్క సామాజిక వర్గంతోనే అభివృద్ధి చెందుతుందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని వైసీపీ విచ్ఛిన్నం చేయాలనుకుంటోందన్నారు చంద్రబాబు.

అమరావతి అంతా గ్రాఫిక్స్ అనేవాళ్లు ఇక్కడికొచ్చి చూడాలని నారా లోకేష్ సవాలు విసిరారు. రాజధాని అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగితే ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేకపోయారని లోకేష్ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories