నా ఇల్లు ఎప్పుడు మునుగుతుందా అని చూస్తున్నారు : చంద్రబాబు

నా ఇల్లు ఎప్పుడు మునుగుతుందా అని చూస్తున్నారు : చంద్రబాబు
x
Highlights

ఒకవైపు వరద నీటితో ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని పట్టించుకోవాల్సింది పోయి, నా ఇల్లు ఎప్పుడు మునుగుతుందా అని కళ్ళలో వత్తులు వేసుకుని చూస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. వరద నీటితో ప్రజలు అల్లాడి పోతుంటే రాష్ట్ర మంత్రులు మాత్రం నా ఇల్లు ఎప్పుడు మునుగుతుందా అని కళ్ళలో వత్తులు వేసుకుని చూస్తున్నారని అన్నారు చంద్రబాబు . నా ఇంటి మీదా పెట్టిన శ్రద్ధ కనీసం ప్రజల మీదా పెడితే బాగుండని అయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరదల్లో ప్రజల ఇబ్బందులు పడుతున్న వీడియోను పోస్ట్ చేసారు . "వరద నీటితో ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని పట్టించుకోవాల్సింది పోయి, నా ఇల్లు ఎప్పుడు మునుగుతుందా అని కళ్ళలో వత్తులు వేసుకుని చూస్తున్నారు మన మంత్రులు. నా ఇంటిమీద పెట్టే శ్రద్ధ కాస్తయినా వరదల మీద పెట్టి ఉంటే ప్రజలకి ఇబ్బందులు తప్పేవి."అంటూ చంద్రబాబు పోస్ట్ చేసారు ..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories