చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
x
Highlights

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. తన ఆరోగ్యం గురించి తనకి బాధగా లేదని, తన ఆందోళన మొత్తం రాష్ట్ర భవిష్యత్తు...

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. తన ఆరోగ్యం గురించి తనకి బాధగా లేదని, తన ఆందోళన మొత్తం రాష్ట్ర భవిష్యత్తు గురించేనని అన్నారు. తన ఆరోగ్యం బాగుంటే మరో 15 ఏళ్లు జీవిస్తానని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన అయన ఈ వాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు చంద్రబాబు.. మూడు రాజధానులకు మద్ధతుగా మా ఊరి నారావారిపల్లెలో వైసీపీ సభ నిర్వహిస్తే ప్రజలు ఎలా వస్తారు? బుద్ధి ఉన్నవారు ఎవరైనా మా ఉరి నుంచి విశాఖపట్నం వెళ్లాలని అనుకుంటారా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు చంద్రబాబు.. ఇక ప్రజావేదికను వేరే పనులకు ఉపయోగించుకోవచ్చు కానీ అలా ఎందుకు కుల్చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన బీహార్ కంటే దారుణంగా ఉందని అయన అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories