సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థుల గల్లంతు

సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థుల గల్లంతు
x
Highlights

శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి అయిదుగురు అందులో గల్లంతు అయ్యారు. వారిలో ఒకరి మృతదేహం...

శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి అయిదుగురు అందులో గల్లంతు అయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో నలుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరంతా శ్రీకాకుళంలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. మృతులు షేక్‌ అబ్దుల్లా, ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, యజ్ఞమయ పండా, కురుమూరి సందీప్‌, అనపర్తి సుందర్‌గా గుర్తించారు. మొత్తం ఆరుగురు విద్యార్థులు కళింగపట్నం బీచ్‌కు వచ్చారు.

సముద్ర స్నానికి వెళ్లేముందు అందరూ కలిసి సెల్ఫీలు దిగారు. అప్పటివరకు అంతా సరదాగా గడిపారు.. అనంతరం సముద్రంలోకి ప్రవేశించారు ఇంతలో భారీ అల రావడంతో వారంతా గల్లంతు అయ్యారు. వారిని గమనించిన మెరైన్ సిబ్బంది ఆరుగురిలో లింగాల రాజసింహం అనే విద్యార్థిని రక్షించారు. మరోవైపు విషయం తెలుసుకున్న విద్యార్థులు కుటుంబాలు... తమ పిల్లల కోసం సురక్షితంగా బయటికి వస్తారని ఎదురు చూస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories