ఏపీలో పట్టుబడిన నగదు.. రూ.22 లక్షల సీజ్

Money Sized: హైదరాబాద్ నుంచి ఆర్టీసీ కార్గోలో నగదు తరలింపు

Jyothi
Published on: 7 April 2024 3:35 PM IST
Cash Seized in Andhra Pradesh
X

ఏపీలో పట్టుబడిన నగదు.. రూ.22 లక్షల సీజ్ 

Money Sized: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో భారీగా నగదు పట్టుబడుతోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ కార్గోలో తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి కార్గో సర్వీస్ ద్వారా జంగారెడ్డిగూడెంకు నగదు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీ నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న నగదును సీజ్ చేసిన పోలీసులు.. ఎవరి పేరు మీద పార్సిల్ వచ్చింది..? ఎవరు పార్సిల్ బుక్ చేశారన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story