లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. చంద్రబాబుపై కేసు నమోదు

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. చంద్రబాబుపై కేసు నమోదు
x
Chandrababu Naidu(File photo)
Highlights

టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై కృష్ణా జిల్లాలో నందిగామ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై కృష్ణా జిల్లాలో నందిగామ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిచారని ఆయనపై కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసుల నమోదు చేశారు. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు పలు చోట్ల లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించలేదని. ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు.

జగ్గయ్యపేట, కంచికర్లలో చంద్రబాబు లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా జనసమీకరణకు కారణమయ్యారని లాయర్‌ శ్రీనివాస్‌ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 25న ప్రత్యేక అనుమతితో ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు మార్గమధ్యంలో పలుచోట్ల పార్టీ కార్యకర్తలు బైక్‌ ర్యాలీలతో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం కూడా దాఖలైంది. మహానాడు ముగియగానే తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories