ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు.. కేసు నమోదు..

ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు.. కేసు నమోదు..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. ఐఎఎస్ అధికారి విజయ్ కుమార్‌పై చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని.....

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. ఐఎఎస్ అధికారి విజయ్ కుమార్‌పై చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని.. పాయకరావుపేట వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే గొల్ల బాబురావు విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను తాను నలభై సంవత్సరాలు అనుభవజ్ఞుడిగా చెప్పుకునే చంద్రబాబునాయుడుకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చంద్రబాబునాయుడును కోర్టుకు లాగుతానని హెచ్చరించారు బాబురావు. బోస్టన్ కమిటీ నివేదిక పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా ఉందని వ్యాఖ్యానించారు.

కాగా ఆదివారం, ఐదుగురు క్యాబినెట్ మంత్రులు చంద్రబాబు నాయుడుకు దళితులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బహిరంగ లేఖ రాశారు. బిసిజి కమిటీ నివేదికను మున్సిపల్ కమిషనర్, ప్లానింగ్ కమిషన్ కార్యదర్శి విజయ్ కుమార్ ఒక ఐఎఎస్, ప్రభుత్వ అధికారి మరియు అతని విధుల్లో భాగంగా వ్యాఖ్యానించారని మంత్రులు స్పష్టం చేశారని అటువంటి బాధ్యతగల ఐఎఎస్ అధికారి పట్ల చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఐఏఎస్ విజయ్ కుమార్ కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రులు లేఖలో డిమాండ్ చేశారు. అయితే ఈ విమర్శలపై తెలుగుదేశం పార్టీ ఇంకా స్పందించలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories