అమరావతి గ్రామాల్లో మరో నిండు ప్రాణం బలి.. రాజధానికి అర ఎకరం భూమి దానం చేసిన గోపాలరావు

అమరావతి గ్రామాల్లో మరో నిండు ప్రాణం బలి.. రాజధానికి అర ఎకరం భూమి దానం చేసిన గోపాలరావు
x
అమరావతి గ్రామాల్లో మరో నిండు ప్రాణం బలి
Highlights

రాజధాని అమరావతి గ్రామాల్లో మరో నిండు ప్రాణం బలైంది. వెలగపూడి గ్రామానికి చెందిన రైతు కూలీ నందిపాటి గోపాలరావు గుండెపోటుకు గురై మృతి చెందారు. గోపాలరావు...

రాజధాని అమరావతి గ్రామాల్లో మరో నిండు ప్రాణం బలైంది. వెలగపూడి గ్రామానికి చెందిన రైతు కూలీ నందిపాటి గోపాలరావు గుండెపోటుకు గురై మృతి చెందారు. గోపాలరావు రాజధాని నిర్మాణానికి అర ఎకరం భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు. రాజధాని తరలిపోతోందని మనస్తాపంతో గుండెపోటుకు గురైనట్లు బంధువులు తెలిపారు. మృతి చెందిన గోపాలరావు భౌతికకాయాన్ని రైతు ప్రతినిధులు సందర్శించి నివాళులు అర్పించారు.

మరోవైపు వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. టెంట్‌లో కూర్చునేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో మహిళ ఎండలోనే దీక్ష కొనసాగించింది. ఎండ వేడికి తట్టుకోలేక పడిపోయిన ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories