శృంగవరపుకోటలో గంజాయి తోపాటు అక్రమ మద్యం స్వాధీనం

శృంగవరపుకోటలో గంజాయి తోపాటు అక్రమ మద్యం స్వాధీనం
x
Highlights

మద్యనియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని చేసినా అక్రమ మద్యం వస్తూనే ఉంది.

మద్యనియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని చేసినా అక్రమ మద్యం వస్తూనే ఉంది. అక్రమ మద్యాన్ని నియంత్రించాల్సిందిపోయి సరఫరా చేస్తున్నారు కొందరు పోలీసులు. విజనగరం జిల్లాలో గంజాయి తోపాటు అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. శృంగవరపుకోట పోలీసులు నిందితులను పట్టుకున్నారు. మండలంలోని బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద ఉదయం ఎనిమిది గంటల సమయంలో అనంతగిరి పోలీస్ స్టేషన్ కు చెందిన చింతపల్లి శ్రీను అనే కానిస్టేబుల్ కు చెందిన బ్యాగులో 29 మద్యం బాటిల్ లు అక్రమంగా తరలిస్తుండగా శృంగవరపుకోట పోలీసులు పట్టుకున్నారు, ఆయనపై అక్రమ మద్యం యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

అదేవిధంగా విజయవాడకు చెందిన బెజ్జంకి సాయి గణేష్, కిషోర్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా వారిని కూడా పట్టుకున్నారు.. రెండు బైకులు, గంజాయి, మద్యం తోపాటు ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories