శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం

శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం
x
Highlights

శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. రణస్థలం మండలం పైడిభీమవరం సమీపంలో ఆగివున్న లారీని.. ఉత్తరాఖండ్‌కు చెందిన టూరిస్ట్ బస్సు ఢీ కొనడంతో.. బస్సు...

శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. రణస్థలం మండలం పైడిభీమవరం సమీపంలో ఆగివున్న లారీని.. ఉత్తరాఖండ్‌కు చెందిన టూరిస్ట్ బస్సు ఢీ కొనడంతో.. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదసమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అయితే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఉత్తరాఖండ్‌కు చెందిన అల్వాని వాసులుగా గుర్తించారు.

పూరి నుంచి రామేశ్వరం వెళ్తుండగా పైడిభీమవరం వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంసమయంలో దట్టమైన పొగలు మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. ఘటన స్ధలానికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. దీంతో దాదాపు గంటకుపైగా ట్రాపిక్‌ నిలిచిపోయింది. ఎటువంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories