శ్రీకాకుళంలో వలస కూలీల బస్సు బోల్తా.. 33 మందికి గాయాలు

శ్రీకాకుళంలో వలస కూలీల బస్సు బోల్తా.. 33 మందికి గాయాలు
x
Highlights

కంటికి కనిపించని కరోనా ప్రజలకు తెస్తున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడికక్కడ అందరూ స్తంభించిపోయిన పరిస్థితి. ఇక పొట్ట చేత పట్టుకుని స్వంత ఊర్లను,...

కంటికి కనిపించని కరోనా ప్రజలకు తెస్తున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడికక్కడ అందరూ స్తంభించిపోయిన పరిస్థితి. ఇక పొట్ట చేత పట్టుకుని స్వంత ఊర్లను, రాష్ట్రాలనూ వదిలి పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్న కూలీల వ్యధలు కథలు కథలుగా వస్తూనే ఉన్నాయి.

ప్రైవేటు బస్సు బోల్తా పడి 33 మంది గాయపడిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన వలసకూలీలు కర్ణాటకలో క్వారంటైన్‌ ముగించుకుని తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్తున్న బస్సు శ్రీకాకుళం జిల్లా మందన మండలం బాలిగాం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 33 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories