కేంద్ర బడ్జెట్‌ వై‌సీపీ ఎంపీల అసంతృప్తి

కేంద్ర బడ్జెట్‌  వై‌సీపీ ఎంపీల అసంతృప్తి
x
Highlights

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందని వైసీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌ కేటాయింపులపై ఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడారు. ఉపాధి...

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందని వైసీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌ కేటాయింపులపై ఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడారు. ఉపాధి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని మిథున్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి 20 వేల కోట్లు రెవెన్యూ లోటు ఉందన్నారు. ఎంపీలందరూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రానికి నిధులు తీసుకొస్తామని మిథున్ రెడ్డి తెలిపారు.

ఏపీలో16 కొత్త మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని, గత ఏడాది కేవలం మూడు మెడికల్‌ కాలేజీలకు మాత్రమే నిధులు ఇచ్చారని అనకాపల్లి ఎంపీ సత్యవతి అన్నారు. ఏపీకి రావాల్సిన నిధులు కోసం ఎంపీలందరూ కలిసి పోరాడతామన్నారు. మహిళలకు ప్రాధాన్యత కల్పించే అంశాలు బడ్జెట్‌లో లేవని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌ చాలా నిరాశ పరిచిందని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఉందని పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories