బోటు ప్రమాదంలో మరో మహిళ మృతదేహం లభ్యం..

బోటు ప్రమాదంలో మరో మహిళ మృతదేహం లభ్యం..
x
Highlights

బోటు ప్రమాదంలో మరో మహిళ మృతదేహం లభ్యం.. బోటు ప్రమాదంలో మరో మహిళ మృతదేహం లభ్యం..

గోదావరి బోటు ప్రమాదంలో 8వ రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం దేవీపట్నం మండలం మూలపాడు వద్ద ఓ మహిళ మృతదేహం దొరికింది. చేపలు కొరకడంతో మృతదేహం పూర్తిగా పాడైనట్టు తెలుస్తోంది. దాంతో వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్ట్‌మార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించనున్నారు. తాజాగా దొరికిన మహిళ మృతదేహంతో కలిపి ఇప్పటి వరకు 37 మందిని వెలికితీశారు. ఇంకా 14 మంది జాడ తెలియాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితిపై తూర్పు గోదావరి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories