![మూడు రాజధానులను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది: సుజనా చౌదరి మూడు రాజధానులను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది: సుజనా చౌదరి](https://assets.hmtvlive.com/h-upload/2019/12/29/279525-sujana.webp)
సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనల నేపథ్యంలో బిజెపి ఎంపి సుజన చౌదరి ఏపీ క్యాపిటల్ అమరావతి పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనల నేపథ్యంలో బిజెపి ఎంపి సుజన చౌదరి ఏపీ క్యాపిటల్ అమరావతి పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాజధాని అభివృద్ధికి కేంద్రం 1,500 కోట్ల రూపాయలు ఇచ్చిందని, గత టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుత వైసిపి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చడంలో విఫలమయ్యాయని ఆయన అన్నారు. అమరావతి సమీపంలో రాజధాని నిర్మించే అవకాశం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చిందని ఆయన గుర్తుచేశారు. రాజధాని నిర్మాణం ఆలస్యం కావడంతో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఓడిపోయారని సుజన అన్నారు. టీడీపీ పాలనలో అమరావతి కోసం 5,600 కోట్లు ఖర్చు చేశారు.
ఇప్పటికే కొన్ని కంపెనీలకు రూ .450 కోట్లు చెల్లించారు. ఇక్కడ వీఐటీ, ఎస్ఆర్ఎం వంటి ప్రఖ్యాత విద్యాసంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించిందని అన్నారు. గతంలో జగన్ ప్రతిపక్ష నాయకుడుగా వున్నప్పుడు రాజధానికి 30,000 ఎకరాలు కావాలని.. అదికూడా విజయవాడ కేంద్రంగా రాజధానిగా ఉండాలని అన్నారని గుర్తుచేశారు. జిఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మధ్యంతర నివేదికల ఆధారంగా రాజధానిని మధ్యలో మారుస్తారా అని సుజన ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన హెచ్చరించారు.
![](/images/logo.png)
About
![footer-logo](/images/logo.png)
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire