అమరావతి రాజధాని తరలింపుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ జీవీఎల్

అమరావతి రాజధాని తరలింపుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ జీవీఎల్
x
Highlights

అమరావతి రాజధాని విషయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం లేదన్నారు....

అమరావతి రాజధాని విషయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. అయితే ఏపీ రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందన్నారు. కేంద్రం జోక్యం ఉండదన్నారు. ఇదిలావుంటే అమరావతిని తరలిస్తున్నారంటూ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఎంపీ సుజనా చౌదరి, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్బంగా అక్కడి రైతులతో సమావేశమయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories