జగన్ ఏడాది పాలనంతా కక్షసాధింపే : కన్నా లక్ష్మీనారాయణ

జగన్ ఏడాది పాలనంతా కక్షసాధింపే : కన్నా లక్ష్మీనారాయణ
x
Highlights

ప్రభుత్వం స్థలాలు అమ్మకాలు నిరసిస్తు జనసేన ధీక్షకు సంఘీబావం తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి...

ప్రభుత్వం స్థలాలు అమ్మకాలు నిరసిస్తు జనసేన ధీక్షకు సంఘీబావం తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. నవరత్నాలు ఇస్తున్నామని చెప్పి అంతకు మించి ప్రజలపై భారం మోపుతున్నారని దుయ్యబట్టారు.

చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్లిన విధంగా తయారైందని,ఏడాది కాలంలోనే ప్రభుత్వ ఆస్తులు అమ్మే పరిస్థితికి తెచ్చారని ఆరోపించారు. హైకోర్టు కూడా ప్రభుత్వం దివాలా తీసిందా అని ప్రశ్నించిందని గుర్తు చేశారు. కోర్టులను కూడా విమర్శించే విధానం చూస్తున్నామని, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు కూడా వైసిపి కార్యాలయాల మాదిరిగా తయారయ్యాయని విమర్శించారు.

ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాల పై బిజెపి, జనసేన ఐక్య పోరాటాలు చేస్తున్నాయని చెప్పారు. తితిదే విషయంలో టీటీడీ హయాంలో చేసిన తీర్మానం అమలు చేశామని చెబుతున్నారు మరి అప్పట్లో మీరేం మాట్లాడారో ఓసారి గుర్తు చేసుకోండని ప్రశించారు. టీటీడీ ఆదర్శంగా తీసుకుని పరిపాలన చేస్తామని మీరు ఎన్నికల సమయంలో ఏమైనా చెప్పారా? అసలు విషయాలు పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో టీటీడీ కూడా ఇలాగే చేస్తే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories