మాజీ మంత్రి ముద్రగడతో భేటీ అయిన బీజేపీ నాయకుడు జీవీఎల్

కాపు ఉద్యమ నేత ముద్రగడతో నరసింహారావు భేటీపై సర్వత్రా ఆసక్తి

Rama Rao
Published on: 21 Feb 2022 4:14 PM IST
BJP Leader GVL Narasimha Rao Met Ex Minister Mudragada Padmanabham
X

మాజీ మంత్రి ముద్రగడతో భేటీ అయిన బీజేపీ నాయకుడు జీవీఎల్

Andhra Pradesh: బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కలిశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో వారి భేటీ జరిగింది. బీజేపీ సీనియర్ నాయకుడు ముద్రగడతో భేటీ అవడం చర్చాంశనీయమైంది. టీడీపీ, వైసీపీ లకు చెక్ పెట్టేందుకు దళిత, బిసి వర్గాలతో ప్రత్యామ్నాయ పార్టీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో వీరి భేటీ జరగడం ఆసక్తికరంగా మారింది. ఐతే ముద్రగడ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు మాత్రమే జీవీఎల్ హాజరయ్యారయ్యారని ముద్రగడ అనుచరులు అంటున్నారు.

Rama Rao

Rama Rao

Next Story