BITS Pilani in AP: అమరావతిలో బిట్స్ క్యాంపస్.. ₹1000 కోట్లతో ఏర్పాటుకు కసరత్తు ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ రాబోతోంది. దేశంలోనే పేరుపొందిన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS Pilani) ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిలో తన కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.

Ramya Vegirouthu
Published on: 13 July 2025 10:23 PM IST
BITS Pilani in AP: అమరావతిలో బిట్స్ క్యాంపస్.. ₹1000 కోట్లతో ఏర్పాటుకు కసరత్తు ప్రారంభం!
X

BITS Pilani in AP: అమరావతిలో బిట్స్ క్యాంపస్.. ₹1000 కోట్లతో ఏర్పాటుకు కసరత్తు ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ రాబోతోంది. దేశంలోనే పేరుపొందిన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS Pilani) ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిలో తన కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ క్యాంపస్ కోసం రూ. 1000 కోట్ల పెట్టుబడితో 35 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

యూనివర్సిటీ ఛాన్సలర్ మరియు బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా ప్రకారం, ఈ క్యాంపస్‌ను ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. 2027 నాటికి పూర్తిస్థాయిలో తరగతులు ప్రారంభించి, రెండు విడతల్లో మొత్తం 7000 మంది విద్యార్థులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ క్యాంపస్‌లో అండర్ గ్రాడ్యుయేట్ (డిగ్రీ) మరియు మాస్టర్స్ ప్రోగ్రామ్స్ అందించనున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇన్నోవేషన్, స్ట్రాటజీ వంటి ఆధునిక, డిమాండ్‌లో ఉన్న కోర్సులపై దృష్టి సారించనున్నారు.

ఇప్పటికే IBM, TCS, L&T వంటి దిగ్గజ కంపెనీలు అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటుచేయాలన్న ప్రణాళికలో ఉన్న సమయంలో, బిట్స్ పిలానీ క్యాంపస్‌కు సంబంధించిన ఈ ప్రకటన రాష్ట్రానికి విద్యా రంగంలో మరింత గౌరవం తీసుకురానుందని చెప్పవచ్చు.

ఈ కొత్త విద్యా కేంద్రం వల్ల నైపుణ్యాలు పెరిగే విద్యార్థుల సంఖ్య పెరగడమే కాదు, అమరావతిలోని ఐటీ, ఇన్నోవేషన్ రంగాలు మరింత బలోపేతం కావడం ఖాయం.


Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story