నంబర్‌ ఇవ్వలేదని వైసీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆటోకు నిప్పు పెట్టుకున్న డ్రైవర్‌

నంబర్‌ ఇవ్వలేదని వైసీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆటోకు నిప్పు పెట్టుకున్న డ్రైవర్‌
x
Highlights

నంబర్‌ ఇవ్వలేదని వైసీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆటోకు నిప్పు పెట్టుకున్న డ్రైవర్‌

తమ ఆటోకు నంబర్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని, తమ ఉపాధి అవకాశాన్ని దెబ్బకొట్టారని నిరసిస్తూ నాగేంద్ర అనే ఆటో డ్రైవర్‌ అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుడ్డుకంట శ్రీధర్‌రెడ్డి ఇంటి ముందు ఆటోకు నిప్పంటించాడు. ఈ ఘటన పుట్టపర్తిలోని ఎమ్మెల్యే ఇంటివద్ద జరిగింది.

పుట్టపర్తి పట్టణంలో నడుపుకునేందుకు మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి హయాంలో 150 ఆటోలకు నంబర్లు ఇచ్చారు. అయితే ఆ ఆటోలన్నింటికీ తాజాగా నంబర్లు కొనసాగించలేదని.. రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇలా చేస్తున్నారని ఆటో డ్రైవర్‌ ఆరోపించాడు.

దీనివలన తాము జీవనోపాధిని కోల్పోతున్నామని.. తమ కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తాడు. తమ బాధ ఏంటో ఎమ్మెల్యేకు తెలియాలనే ఈ ఘటనకు పాల్పడినట్లు ఆటో డ్రైవర్‌ నాగేంద్ర తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగేంద్రను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories