సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు : డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు : డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
x
పుష్పశ్రీవాణి
Highlights

చంద్రబాబు పాలనలో ఎస్సీలకు అన్యాయం జరిగిందని విమర్శించారు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. శాసనసభలో ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ప్రత్యేక బిల్లుపై...

చంద్రబాబు పాలనలో ఎస్సీలకు అన్యాయం జరిగిందని విమర్శించారు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. శాసనసభలో ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ప్రత్యేక బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ప్రతిష్టాత్మకమైన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బిల్లుపై టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారన్నారు. వీరికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీలకు మరింత మేలు చేసేందుకే ఈ బిల్లు ఉపయోగపడుతుందని. ఈ నిర్ణయంతో సీఎం వైఎస్‌ జగన్‌కు యావత్‌ గిరిజనుల తరపున ధన్యవాదాలు అని తెలిపారు. చంద్రబాబు కేబినెట్ లో ఎస్సీలకు మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత తొలగించారని గుర్తు చేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు తగిన న్యాయం జరుగుతోందని పుష్పశ్రీవాణి తెలిపారు. తన కేబినెట్‌లో ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులిచ్చిన ఏకైక సీఎంగా వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు' అని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories