నేటి నుంచి ఇసుక డోర్ డెలివరీ సౌకర్యం

నేటి నుంచి ఇసుక డోర్ డెలివరీ సౌకర్యం
x
Highlights

ఏపీలో నేటినుంచి ఇసుక డోర్ డెలివరీ సౌకర్యం ప్రారంభమవుతుంది. అయితే ఒక్క కృష్ణా జిల్లాలో మాత్రమే ఈ అవకాశం ఉంది.

ఏపీలో నేటినుంచి ఇసుక డోర్ డెలివరీ సౌకర్యం ప్రారంభమవుతుంది. అయితే ఒక్క కృష్ణా జిల్లాలో మాత్రమే ఈ అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సౌకర్యాన్నిపైలట్ ప్రాజెక్ట్ గా కృష్ణా జిల్లాలోనే అమలు చేపట్టారు. ప్రజలకు ఇసుకను అందించడం తోపాటు వారి ఇంటికి చేర్చడానికి రవాణా సౌకర్యాన్ని కూడా ఎపిఎండిసి బాధ్యత తీసుకుంది. ఇసుక కావాలనుకునే వారు వెబ్‌సైట్‌లో నిర్మాణ వివరాలను ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది. అంతేకాదు మ్యాప్ ద్వారా జిపిఎస్‌ను ట్యాగ్ చేయవచ్చు. వెబ్‌సైట్‌లో ఇసుకను బుకింగ్ చేసుకున్న తరువాత నేరుగా ఆ ప్రదేశానికి పంపిస్తుంది ఎపిఎండిసి.

అయితే వినియోగదారులు బుకింగ్ మరియు షిప్పింగ్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. 20 కి.మీకి టన్ను ఇసుకకు రూ .6.60 రవాణా ఖర్చు చెల్లించాలి. అలాగే 30 కి.మీ ఉంటే కి.మీకి రూ .4.90, 30 కి.మీ పైన రూ .6 వసూలు చేస్తారు. ఇదిలావుంటే రాబోయే నాలుగు నెలల్లో ఎపిఎమ్‌డిసి ప్రతి నెలా 15 లక్షల టన్నుల చొప్పున మొత్తం 60,000 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయాలని భావిస్తోంది. దీంతో రాబోయే వర్షాకాలానికి 60,000 లక్షల టన్నుల ఇసుక సరిపోతుందని భావిస్తోంది. కాగా ఇసుక తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ ఏర్పాట్లు చేయాలని, అవినీతిని నివారించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఇప్పటికే ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories