తలసానితో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే భేటీ

తలసానితో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే భేటీ
x
Highlights

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు భేటీ అయినట్టు తెలుస్తోంది. రెండోసారి మంత్రిపదవి చేపట్టిన సందర్బంగా...

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు భేటీ అయినట్టు తెలుస్తోంది. రెండోసారి మంత్రిపదవి చేపట్టిన సందర్బంగా తలసానిని అభినదించడానికి త్రిమూర్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో ఏపీ రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. కొన్నాళ్లుగా త్రిమూర్తులు వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

ఇదిలావుంటే ఇటీవల ఏపీలో పర్యటించిన మంత్రి తలసానిపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలకు ధీటుగా తలసాని జవాబిచ్చారు.. ఏపీలో తన పర్యటనలు ఇకపై కూడా కొనసాగుతాయని. తాను పర్యటిస్తుంటే టీడీపీ నేతలకు భయమేంటని అన్నారు. తనకు అక్కడ బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు ఉన్నారు. అయినా నా నియోజకవర్గంలో ప్రచారం చేసి నన్ను ఓడించేందుకు చంద్రబాబు కుట్రలు చేశారని తలసాని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories