హుందాగా నడుచుకో..పవన్ పై బొత్స తీవ్ర విమర్శలు

Botcha satyanarayana
x
Botcha satyanarayana
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స విమర్శలు గుప్పించారు. విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్ కళ్యాన్ బొత్సపై పలు వాఖ్యలు చేశారు. దీనిపై...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స విమర్శలు గుప్పించారు. విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్ కళ్యాన్ బొత్సపై పలు వాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన బొత్స తాను ఇంటికి వెళ్లి బతిమాలానని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ముందు పవన్ హుందాగా నడుచుకోవాలి సూచించారు. తాను నోరు తెరిస్తే పవన్ కళ్యాన్ జవాబు కూడా చెప్పుకోలేరని విమర్శించారు.

తాను పవన్‌ను బతిమాలుకున్నానని హీరోగారు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడంలేదని ఎద్దేవా చేశారు. సినిమాలకు రాజకీయాలకు తేడా ఉందని, రాజకీయాల్లో నటన ఎంతమాత్రము పనికి రాదన్నారు. పాతికేళ్లపాటు రాజకీయాల్లో ఉంటానని ఎప్పుడో ఒకసారి బయటకు వస్తారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పాలనలో ఎప్పుడైనా ప్రశ్నించారా, అందకే ప్రజలు తగిన గుణపాఠం చేప్పారని దుయ్యబట్టారు. రాజధానికి తాత్కాలికమే తప్ప ఒక్క శాశ్వత కట్టడం లేదని, రాజధానికి గుర్తింపు లేకుండా పోయిందన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పైగా బొత్స నిప్పులు చెరిగారు. చంద్రబాడు పాలనలో ఆర్థికంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. చంద్రబాబు విధి విధానాలు ప్రజలు ఏనాడో తిరస్కరించారు. వాటిని తాము అనుసరించమని వ్యాఖ్యానించారు. అమరావతి బంగారు బాతు ఎక్కడుందని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో 57వేల కోట్లు లోటు బడ్జేట్ మిగిలచ్చారని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories