దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు : హోం మంత్రి
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతల కారుపై దాడి జరిగింది. ఈ కారులో బుద్దా వెంకన్న, బొండా ఉమా ఉన్నారు. ఈ దాడి ఘటనలో బాధ్యులైన వారిని గుర్తించినట్లు...
గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతల కారుపై దాడి జరిగింది. ఈ కారులో బుద్దా వెంకన్న, బొండా ఉమా ఉన్నారు. ఈ దాడి ఘటనలో బాధ్యులైన వారిని గుర్తించినట్లు పోలీసులు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. టీడీపీ నేతలపై దాడి చేసిన ముగ్గురు తురక కిషోర్, నాగరాజు, గోపిలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
అలాగే ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ నాయకులు పల్నాడులో కావాలనే పర్యటించారని ఆరోపించారు. పల్నాడు అత్యంత సున్నితమైన ప్రాంతమని తెలిసి వారు అక్కడకు పర్యటించారని ఆరోపించారు. ఎన్నికలను ఆపేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే ఎన్నికల సమయంలో సున్నితమైన ప్రాంతాలకు వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఎన్నికలు మద్యం, డబ్బు పంచకుండా విభిన్న రీతిలో జరగబోతున్నాయని వెల్లడించారు.
మాచర్ల దాడి నిందితుల అరెస్ట్.. హోం మంత్రి చురకలు
ఈ రోజు మాచర్ల సంఘటనకు బాధ్యులైన ముగ్గురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు.
— Mekathoti Sucharitha (@SucharitaYSRCP) March 11, 2020
తురక కిషోర్, గోపి, నాగరాజు అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.(1/3)
పల్నాటి ప్రాంతం అత్యంత సున్నితమైన ప్రాంతమని తెలిసి కూడా కావాలనే టీడీపీ నాయకులు పర్యటించారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఎన్నికలను ఆపేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించారు.
— Mekathoti Sucharitha (@SucharitaYSRCP) March 11, 2020
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారి పైనైనా చర్యలు తీసుకుంటాము.(2/3)
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire