చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ఖర్చుపై హైకోర్టు ఆశ్చర్యం.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు

చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ఖర్చుపై హైకోర్టు ఆశ్చర్యం.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు
x
Highlights

కేంద్రం అన్యాయం చేసిందని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధర్మపోరాటం పేరుతో దీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 11న ...

కేంద్రం అన్యాయం చేసిందని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధర్మపోరాటం పేరుతో దీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 11న చంద్రబాబు ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒక్కరోజు 'ధర్మ పోరాట దీక్ష' జరిగింది. అయితే, ఈ కార్యక్రమానికి రూ. 10 కోట్లు ఖర్చు చేశారని.. ఇదంతా ప్రజల సొమ్మని సవాల్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వేటుకూరి సూర్యనారాయణరాజు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు. దీన్ని గురువారం హైకోర్టు విచారించింది. ఈ సందర్బంగా ఇంత మేర ఖర్చు కావడంపై ఏపీ హైకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్టు అతను తెలిపాడు.

ఈ పిల్ పై విచారణ సందర్భంగా, పిటిషనర్ తరపు న్యాయవాది టీడీపీ పార్టీ లబ్ధి కోసం ఈ దీక్షను చేపట్టారని, దీనికి ప్రజాధనాన్ని భారీ ఎత్తున దుర్వినియోగం చేయడం ఏంటని వాదించారు.. దీనికి రూ. 10 కోట్లను కేటాయిస్తూ జీవో జారీ చేసిన అధికారి ఎవరని హైకోర్టు ప్రశ్నించింది. ఏ నిబంధనల మేరకు ఈ నిధులను విడుదల చేశారని అడిగింది. ఇంత భారీ స్థాయిలో ఏమి ఖర్చులు చేశారని ప్రశ్నిస్తూ.. పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని వైసీపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 21వ తేదీకి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories