AP High Court: ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టులో ఎదురుదెబ్బ

AP High Court Orders to Dhulipalla Narendra Kumar to File Affidavit
x

దూలపల్లి నరేంద్ర (ఫైల్ ఇమేజ్)

Highlights

AP High Court: ధూళిపాళ్ల క్వాష్‌ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోని హైకోర్టు.. విచారణ కొనసాగించాలంది

AP High Court: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధూళిపాళ్ల క్వాష్‌ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోని హైకోర్టు.. విచారణ కొనసాగించాలంది. మే 5లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో పలు అక్రమాలు, అవినీతి కేసులో ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..

ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. సంగం డెయిరీ అక్రమాల కేసులో ఏ1గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ కస్టడీకి కోరనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories