పులివెందుల లో పశువుల కోసం వ్యాక్సిన్ తయారీ కేంద్రం!

పులివెందుల లో పశువుల కోసం వ్యాక్సిన్ తయారీ కేంద్రం!
x
Highlights

ఏపీ సర్కార్‌ మరో కీలక ఒప్పందం చేసుకుంది. పశువుల కోసం ప్రపంచస్థాయి వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేసింది. పులివెందుల ఏపీ...

ఏపీ సర్కార్‌ మరో కీలక ఒప్పందం చేసుకుంది. పశువుల కోసం ప్రపంచస్థాయి వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేసింది. పులివెందుల ఏపీ కార్ల్‌లో వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో ఐజీవైతో అవగాహన ఒప్పందం కుదురింది. ఈ మేరకు ఏపీ కార్ల్‌ సీఈఓ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు, ఐజీవై ఇమ్యునోలాజిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ డాక్టర్‌ ఆదినారాయణరెడ్డి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

పశువులకు కావాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లు పులివెందులలో తయారీ కానున్నాయి. గొర్రెలకు సహజంగా సోకే చిటెక రోగం, బొబ్బర్ల రోగం, పీపీఆర్, పశువుల్లో వచ్చే గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా మొదలగు వ్యాధులకు అవసరమైన వ్యాక్సిన్ల తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌కు ఐజీవై దాదాపు రూ. 50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పించనుంది. దీంతో 100 నిపుణులకు, సిబ్బందికి ఉపాధి కలగనుంది. మన రాష్ట్రాలు అవసరాలు తీర్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories