సచివాలయ అభ్యర్థులకు శుభవార్త..

సచివాలయ అభ్యర్థులకు శుభవార్త..
x
Highlights

సచివాలయంలో నియామకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సచివాలయ పరీక్షలు రాసిన ఓసి, బిసి అభ్యర్థులకు...

సచివాలయంలో నియామకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సచివాలయ పరీక్షలు రాసిన ఓసి, బిసి అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ మార్కులు తగ్గించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నివేదికను పంచాయతీ రాజ్ శాఖ రేపు ప్రభుత్వానికి సమర్పించనుంది. తగ్గించిన మార్కుల ఆధారంగా మొత్తం 1,26,728 పోస్టుల్లో మిగిలిన పోస్టులకు నియామకాలు జరుగుతాయి. తాజాగా కట్‌ఆఫ్‌ మార్కులు 4 నుంచి 5 శాతం తగ్గుతాయని భావిస్తున్నారు. కాగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల అర్హత మార్కులను ప్రభుత్వం ఇప్పటికే తగ్గించింది. కట్‌ఆఫ్ మార్కుల తగ్గుదలతో ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులు భర్తీ కానున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories