ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
x
Highlights

వాల్మీకి జయంతిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా ఆశ్వయుజ పౌర్ణమి రోజు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతోత్సవాలు ప్రభుత్వం నిర్వహించనుంది.

వాల్మీకి జయంతిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా ఆశ్వయుజ పౌర్ణమి రోజు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతోత్సవాలు ప్రభుత్వం నిర్వహించనుంది. మొదట అనంతపురం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. వాల్మీకి జయంతి కోసం రూ. 25లక్షలప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 2017లోనే తెలంగాణ ప్రభుత్వం వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపట్ల బోయిలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories