విజయసాయిరెడ్డి నియామకం రద్దు

విజయసాయిరెడ్డి నియామకం రద్దు
x
Highlights

వైసీపీ ముఖ్యనేత, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి...

వైసీపీ ముఖ్యనేత, ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే విజయసాయిరెడ్డిని ఆ పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా దాన్ని వెనక్కి తీసుకోవడం గమనార్హం. ఈ ఉత్తర్వులు రద్దుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే విజయసాయి స్థానంలో ఎవరిని నియమిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నేతలను ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వం ప్రతినిధిగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories